మునగాల మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఆహ్వానం

TEJA NEWS

మునగాల మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఆహ్వానం

23 జనవరి, ఉదయం 10:00 గంటలకు
మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ,
వారి సతీమణి శ్రీమతి సుధా దేవ్ వర్మ విచ్చేయనున్నారు.

దర్శనం అనంతరం, గుడికి సమీపంలోని గ్రౌండ్‌లో —

  • రూ.150 కోట్ల వ్యయంతో మంజూరైన హుజూర్‌నగర్ ప్రభుత్వ వ్యవసాయ కళాశాల
  • రూ.50 కోట్ల వ్యయంతో మంజూరైన కోదాడ జవహర్ నవోదయ విద్యాలయం

ఈ రెండు సంస్థల శిలాఫలకాలను గవర్నర్ ఆవిష్కరించి ప్రసంగించనున్నారు.

ఈ కార్యక్రమానికి
రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ,
కోదాడ శాసనసభ్యులు శ్రీమతి పద్మావతి రెడ్డి
హాజరుకానున్నారు.

కావున మునగాల మండలంలోని అన్ని గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, సమన్వయ కమిటీ సభ్యులు, సర్పంచ్లు , ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, అందరూ
గవర్నర్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆహ్వానిస్తున్నాము.

మీ,
కొప్పుల జైపాల్ రెడ్డి రెడ్డి
అధ్యక్షులు,
మునగాల మండల కాంగ్రెస్ పార్టీ.

You cannot copy content of this page

Scroll to Top