17 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీ సమావేశంలో నిర్ణయం
ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ సమావేశం ముగిసింది.
▪️మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, అవసరమైతే పొడిగించాలని నిర్ణయించారు.
▪️17 రోజులపాటు అసెంబ్లీ కార్యకలాపాలు నిర్వహించనున్నారు.
▪️ఈనెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
▪️మహా శివరాత్రి తర్వాత రోజు 16న సెలవు ప్రకటించారు.
▪️17, 18 తేదీల్లో బడ్జెట్పై చర్చ జరగనుంది.
▪️18న ఆర్థిక మంత్రి సమాధానం ఇవ్వనున్నారు.

