BLR క్రికెట్ టోర్నమెంట్ నీ ప్రారంభించిన,మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి
రామంతాపూర్ చిన్న చెరువు మైదానంలో
మాజీ కార్పొరేటర్ శ్రీమతి & శ్రీ గంధం జ్యోత్స్మా నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో
BLR క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి ,ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి , మాట్లాడుతూ యువత క్రీడల వైపు ఆకర్షితులై శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇలాంటి క్రీడా పోటీలు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా సమాజంలో ఐక్యతను మరింత బలపరుస్తాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
