29 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన సీఎం రేవంత్ రెడ్డి
కారుణ్య నియామకం కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న కుటుంబంలో సీఎం రేవంత్ సంతోషం నింపారు. హెడాకానిస్టేబుల్గా పనిచేస్తున్న WGLకు చెందిన భీమ్సింగ్ 1996 SEP 24న ఎన్కౌంటర్లో చనిపోయారు. తండ్రి ఉద్యోగం కోసం కుమార్తె రాజశ్రీ దరఖాస్తు చేయగా, సాంకేతిక కారణాలతో గత ప్రభుత్వాలు ఉద్యోగం ఇవ్వలేదు. వర్ధన్నపేట MLA నాగరాజు CM దృష్టికి విషయం తీసుకెళ్లగా, ఆయన చొరవతో ఆమెను హోంశాఖలో జూ. అసిస్టెంట్గా నియమించారు.
