సిపిఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చెయ్యండి.
ఎమ్మెల్సి సత్యం పిలుపునిచ్చారు.
సిపిఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను ఆగష్టు 19 నుండి 22 వరకు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం లో నిర్వహిస్తున్నామని ఈ మహాసభలకు రాష్ట్రంలోని అన్ని మండలాల నుండి ఎంపిక చేసిన 1000మంది ప్రతినిధులు పాల్గొంటున్నారని కావున రాష్ట్ర మహాసభల విజయవంతం కొరకు ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా కోరుతూ నేడు సిపిఐ ఎమ్మెల్సీ సత్యం ఎమ్మెల్సి శంబిపూర్ రాజు ని కలవడం జరిగింది.
ఈ సందర్బంగా శంబిపూర్ రాజు ఎమ్మెల్సీ కి శాలువాతో సత్కరించి మహాసభల విజయవంతం కోసం తన వంతుగా సహకారం అందిస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు యూసఫ్,జిల్లా కార్యదర్శి ఉమా మహేష్,రాష్ట్ర సమితి సభ్యులు ఏసురత్నం,మండల కార్యదర్శి స్వామి పాలాభిందల శ్రీనివాస్,సిపిఐ నాయకులు వి.శ్రీనివాస్,హరినాథ్,నర్సింహా రెడ్డి,యాదయ్య,జంబూ మాజీ కార్పొరేట్పర్ సురేష్ రెడ్డి పాల్గొన్నారు.
