సిపిఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చెయ్యండి.ఎమ్మెల్సి సత్యం పిలుపునిచ్చారు.

TEJA NEWS

సిపిఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చెయ్యండి.
ఎమ్మెల్సి సత్యం పిలుపునిచ్చారు.


సిపిఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను ఆగష్టు 19 నుండి 22 వరకు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం లో నిర్వహిస్తున్నామని ఈ మహాసభలకు రాష్ట్రంలోని అన్ని మండలాల నుండి ఎంపిక చేసిన 1000మంది ప్రతినిధులు పాల్గొంటున్నారని కావున రాష్ట్ర మహాసభల విజయవంతం కొరకు ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా కోరుతూ నేడు సిపిఐ ఎమ్మెల్సీ సత్యం ఎమ్మెల్సి శంబిపూర్ రాజు ని కలవడం జరిగింది.
ఈ సందర్బంగా శంబిపూర్ రాజు ఎమ్మెల్సీ కి శాలువాతో సత్కరించి మహాసభల విజయవంతం కోసం తన వంతుగా సహకారం అందిస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు యూసఫ్,జిల్లా కార్యదర్శి ఉమా మహేష్,రాష్ట్ర సమితి సభ్యులు ఏసురత్నం,మండల కార్యదర్శి స్వామి పాలాభిందల శ్రీనివాస్,సిపిఐ నాయకులు వి.శ్రీనివాస్,హరినాథ్,నర్సింహా రెడ్డి,యాదయ్య,జంబూ మాజీ కార్పొరేట్పర్ సురేష్ రెడ్డి పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top