జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

TEJA NEWS

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట నియోజకవర్గం
దమ్మపేట మండలంలోని ముష్టిబండ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంచు కారణంగా దృశ్యమానత తగ్గటంతో బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మూడు విద్యుత్ స్తంభాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఆ సమయానికి వేరే వాహనాలు రానందున పెద్ద ప్రమాదమే తప్పిందని తెలిపారు. బస్సులో, లారీలో పలువురికి గాయాలు కాగా వారిని అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన స్థలం పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

You cannot copy content of this page

Scroll to Top