ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రమండలి ఆర్థిక సహాయం…
చిలుకూరు మండలం రామచంద్రానగర్ ఉద్యోగ, ఉపాధ్యాయ మిత్రమండలి రామినేని. కళింగ రావు(డిఎస్పీ) మరియు వసుకుల రామారావు (జిహెచ్ఎం) ఆధ్వర్యంలో అంకతి నరసయ్య ని కలిసి స్వర్గీయ అంకతి నాగమ్మ మరణం పట్ల సానుభూతి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగ , ఉపాధ్యాయ మిత్రమండలి తరపున 75 కేజీల బియ్యం మరియు 40,500/- ఆర్ధిక సహాయం గ్రామ పెద్దల సమక్షంలో అందించడం జరిగింది. ఈ సందర్భంగా నరసయ్య మరియు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉద్యోగ,ఉపాధ్యాయ మిత్రమండలికి ధన్యవాదాలు తెలియజేశారు.
