
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 58 జీవో ద్వారా పట్టాలు మంజూరు చేయడం మరియు 59 జీవో ద్వారా రిజిస్ట్రేషన్లు పున్న ప్రారంభించేలా చర్యలు చేపట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ, బిజెపి స్టేట్ కౌన్సిల్ మెంబర్ చెంది శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది.
ఈ సందర్భంలో బిజెపి నాయకులు పత్తి రఘుపతి రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా ప్రచార సహా కార్యదర్శి, శ్రీ జూటూరి వేణుగోపాలరావు బిజెపి సీనియర్ నాయకులు, శ్రీ సంతోష్ గుప్తా డివిజన్ బిజెపి మాజీ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు.