కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ లో ఇటీవల నిర్వహించిన కాలనీ సంక్షేమ సంఘం ఎన్నికల్లో గణ విజయంతో కాలనీ అధ్యక్షులుగా విజయం సాధించిన సోదరుడు బాసుపల్లి నాగదీప్ గౌడ్ కి, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన జి. మనోహర్ కి, ట్రెజరర్గా బాధ్యతలు స్వీకరించిన ఎస్. జ్ఞానేశ్వర్ గౌడ్ కి మరియు వారి ప్యానెల్ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి నూతన కమిటీ కాలనీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ, కాలనీలోని సమస్యలను వేగంగా పరిష్కరించి, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆకాంక్షించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.
ఈ కార్యక్రమం లో రాజాసింగ్,వినోద్ కుమార్ గౌడ్,సర్దార్,శంకర్,ఐలయ్య,అశోక్,శ్రీనివాస్,జీవన్ గౌడ్,సురేందర్ రెడ్డి,శేఖర్,సందీప్ రెడ్డి,చాన్ పాషా తదితరులు పాల్గొన్నారు.
