కార్తీక మాసం చివరి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన గాజులరామారం కార్పొరేటర్ రావుల శేషగిరి
కుత్బుల్లాపూర్:
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సీనియర్ బీజేపీ నాయకులు, గాజులరామారం కార్పొరేటర్ రావుల శేషగిరి దంపతులు కార్తీక మాసం చివరి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
టీఎస్ఐఐసీ కాలనీలో కాశి విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్న రావుల శేషగిరి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖః సంతోషాలతో ఉండాలని… కాశీ విశ్వశ్వరుణ్ణి వేడుకున్నారు.
అనంతరం కైసర్ నగర్ పరిధిలో శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం సన్నిధానం స్వాములు ఇరుముడులు కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
