శ్రీ మరకత శివాలయ అమ్మవారికి బహుకరించిన హారం
శంకర్పల్లి మండలం పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో వెలసిన 11 వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలోని అమ్మవారికి ఆలయ కమిటీ సోమవారం మూడు వరుసల హారాన్ని బహుకరించారు. కార్యక్రమంలో అంతర్జాతీయ ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు, ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి, అర్చకుడు ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
