మంచినీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా..!సబీహా గౌసుద్దీన్

TEJA NEWS

మంచినీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా..!
సబీహా గౌసుద్దీన్

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్ లో మంచినీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ అన్నారు. స్థానికుల ఫిర్యాదుతో కార్పొరేటర్ బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు కార్పొరేటర్ దృష్టికి మంచినీటి సప్లై కొరత ఉందని, మంచినీరు కలుషితమవుతుందని, సీసీ రోడ్డు, విద్యుత్ దీపాల సమస్యలు స్థానికులు తెలియపరిచారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సంబంధిత అధికారులతో మాట్లాడి మంచినీటి కలుషితం, మరియు నీటి సరఫరా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కార్పొరేటర్ జలమండలి మేనేజర్ అన్వేత్ కి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జహీద్ షరీఫ్ బాబా, టిఆర్ఎస్ రాజు, బద్రి నాయక్, బ్రహ్మ, కళ్యాణ్ నాయక్, శ్రీనివాస్ యాదవ్, అప్పన్న, శంకర్, కొండయ్య, సైదమ్మ, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top