వ్యవసాయ డీలర్ షాపులలో ఆకస్మిక తనిఖీలు:
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణం లోని పలు వ్యవసాయ డీలర్స్ షాపు లలో టాస్క్ ఫోర్స్ బృందాలు తనికి నిర్వహించడం జరిగింది,
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్క రైతు ప్యాకెట్ల లో ఉన్న విత్తనాలనే కొనాలి అంతే కాకుండా రసీదు భద్రపరచుకోవాలి, గ్రామాలలో వ్యవసాయ శాఖ లైసెన్స్ లేకుండా ఎవరు కూడా వ్యాపారం చేయకూడదు, ఒకవేళ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసినట్టయితే వారి దగ్గర కొనుగోలు ఎవరు కూడా చేయకూడదు అదేవిధంగా లైసెన్స్ లేని వ్యాపారస్తుల పై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరు కూడా గ్రామాలలో లైసెన్స్ లేని వ్యాపారం చేయకూడదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఎస్ఐ మాధవరెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి సురేష్, తదితరులు పాల్గొన్నారు.
