యువత జాతిపిత అడుగుల్లో నడవాలి
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ముస్లిం సోదరులు
కోవూరుమన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కోవూరు గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన కోవూరు మండల ముస్లిం సోదరులు మహాత్మా గాంధీ అమరహే అంటూ నినాదాలతో ఆ జాతిపితను తలుచుకోవడం జరిగింది. యువత కూడా ఆ మహానుభావుడు అడుగుజాడల్లో నడిచి ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని చెడు మార్గాలకు దూరంగా ఉండాలని తెలిపారు.. పై కార్యక్రమంలో షేక్. జహంగీర్, సయ్యద్ మసూద్, షేక్. జమీర్, పఠాన్ సమీవులా, షేక్. ఖలీల్, షేక్. ఖాదర్ బాషా, పటాన్ నజీర్, షేక్ మున్వార్, మరియు మైనార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..
