
ఎమ్మెల్యే జిఎంఆర్ ఆదేశాలతో_
_ముమ్మరంగా వడ్ల కొనుగోలు
వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండల లోదేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి
ఆదేశాలతో జిల్లా అధికారుల పర్యవేక్షణలో
కొత్తకోట, రామకృష్ణాపురం సొసైటీ, ఐకేపీ కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతమైంది.
కొత్తకోట టౌన్, వివిధ గ్రామాలలో ఎమ్మెల్యే జిఎంఆర్ ఆదేశాలతో పిఎసిఎస్, ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలును అధికారులు వేగవంతం చేశారు.
కొత్తకోట టౌన్, మండల ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాలను సందర్శించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం తూకం వేయాలని, గోనె సంచుల కొరత లేకుండా చూడాలని అధికారులను కోరారు.