వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభసందర్భంగా 124 అల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అల్విన్ కాలనీ తులసీవనంలోని మరియు కూకట్పల్లి హోసింగ్ బోర్డు లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలను దర్శించి, ఆనంద్ ప్రసాద్, రాంబాబు రాజు, శ్యామలరాజు తో ప్రత్యేక పూజా కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఆ వైకుంఠ వాసుడి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ, ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియచేసారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి, MRK రెడ్డి, పోశెట్టిగౌడ్, వంశీ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
