
తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? కిషన్ రెడ్డి ప్రశ్న
తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? కిషన్ రెడ్డి ప్రశ్న
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘చలో అసెంబ్లీ’ని అడ్డుకుని, బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం కాంగ్రెస్ అరాచకత్వానికి పరాకాష్ట అని, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కంటే కమిషన్ల వసూళ్లపైనే ఎక్కువ దృష్టి పెట్టిందని ఘాటుగా వ్యాఖ్యానించారు.