చెరువులో అనుమానిత మృత దేహం కేసు లో పోలీసులు పురోగతి

TEJA NEWS

గుంటూరు

చెరువులో అనుమానిత మృత దేహం కేసు లో పోలీసులు పురోగతి

గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కామెంట్స్

ప్రతిపాడు మండలం ఏనమదల గ్రామ పరిధిలోని కాటూరి మెడికల్ కాలేజ్ వద్ద ఉన్న చెరువులో గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు…

చెరువు దగ్గర రక్తంతో తడిచిన గోతం ఉండటంతో అనుమానాస్పద మృతిగా దర్యాప్తు చేపట్టాం…

పోలీస్ దర్యాప్తులో… బార్య ఉప్పుతల లక్ష్మీ మరో ముగ్గురితో కలిసి హతమార్చినట్లు గుర్తించాం…

రాబడిన సమాచారం మేరకు నిందితులు ఊరి వదిలి పారిపోతుంటే చాకచక్యంగా పట్టుకున్నాం …

మృతుడు..బార్య లక్ష్మిపై అనుమానంతో మద్యం సేవించి వేధిస్తున్నాడన్న కారణంతో భర్త తన్నీరు వెంకటేశ్వర్లు (30) ని చంపినట్లు ఒప్పుకున్న నిందితులు.

నిందితులు
A1) ఉప్పు తల లక్ష్మి
A2) సిద్ధి సురేష్
A3) సిద్ధి అంకమ్మ
A4)దుండగుల ఓంకార్

మృతుడిని ఒక స్తంభానికి కట్టేసి కొట్టడంతో వెంకటేశ్వర్లు చనిపోయాడు…

మృతుడిని మొదట ఇంట్లో పూడ్చి పెడదాం అనుకున్నారు ఆది కుదరకపోవడంతో…

గోతంలో కట్టి గోతానికి రాయిని కట్టి చెరువులో విసిరేసారన్న ఎస్పీ…

నిందితులు నేరం ఒప్పుకోవడంతో రిమాండ్ కి తరలింపు…

You cannot copy content of this page

Scroll to Top