మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నర్సారెడ్డి భూపతిరెడ్డి .
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన మక్కినేని మను చౌదరి (ఐఏఎస్) ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి తో కలిసి నూతన కలెక్టర్ కి శుభాకాంక్షలు తెలియచేసిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు మల్లిపెద్ది సుధీర్ రెడ్డి , కుత్బుల్లాపూర్ నియోజక వర్గం ఇంచార్జ్ కోలాన్ హనుమంత్ రెడ్డి ,మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ , ఉప్పల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఎం పరమేశ్వర్ రెడ్డి , కూకట్పల్లి నియోజకవర్గం ఇంచార్జ్ బండి రమేష్ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి ,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి , టిపిసిసి జనరల్ సెక్రెటరీ పీసరి మైపాల్ రెడ్డి ,మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్ , జిల్లా ఆర్టిఏ నెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి మరియు జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
